
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి కాపాడాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో గల మహాత్మా గాంధీ విగ్రహ సమీపంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ సుహాసిని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోoటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ బి కిషన్, సి.ఐ కరుణాకర్, కౌన్సిలర్లు గోస్కుల రాజ్ కుమార్, జున్నోజు భాస్కర్, వజ్జపల్లి వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి రమేష్ గౌడ్, బోరగల మొగిలి, నాంపల్లి శ్రీనివాస్, వడ్లూరి శ్రీలేఖ, పంజాల మనోజ్, కో ఆప్షన్ సభ్యులు గొట్టే జమదగ్ని, ఎండి అలీమ్, ఆలేటి సుశీల, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, నాయకులు బండ నవీన్, ఆశు, తదితరులు పాల్గొన్నారు.


వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఏసిపి మాధవి, చైర్పర్సన్, కౌన్సిలర్లు..





