
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన కట్కూరి సౌందర్య – ఏసు దంపతుల పెద్ద కూతురు కట్కూరి సంపూర్ణకు శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓరియంటల్ విభాగం డీన్ డాక్టర్ సిల్మా నాయక్ చేతుల మీదుగా డాక్టరేట్ ను ప్రధానం చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం పద్మ కుమారి పర్యవేక్షణలో “ఘండికోట హరిచందన రచనలు – పరిశీలన ” అనే అంశం మీద పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. బి ఓ ఎస్ డాక్టర్ బి.ప్రేమ్ కుమార్, డాక్టర్ చవ్వా వెంకట్ రెడ్డి, డాక్టర్. కె చంద్రశేఖరరావు, మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

తెలియజేస్తున్న వారు: జి వివేక్, పిఎసిఎస్ సెక్రటరీ హుజరాబాద్, కరీంనగర్ జిల్లా.





