మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈ నెల 31వ తేదీ శుక్రవారం రోజున సబ్ స్టేషన్లో మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం వుంటుందని ట్రాన్స్ కో టౌన్ ఏఈ ఏం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వీకెండ్ మరమ్మతుల కారణంగా హుజురాబాద్ పట్టణంతో పాటు, కొత్తపల్లి, బొర్నపల్లి, తుమ్మనపల్లిలలో ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు విద్యత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.





