
స్వర్ణోదయం ప్రతినిధి, నల్లగొండ:
నల్లగొండ మున్సిపాలిటీలోని 11 వార్డు వాటర్ ట్యాంక్లో ఓ శవం సోమవారం కనుగొన్నారు. అదే నీళ్లను పదిరోజులుగా జనం వాటర్ ను తాగుతున్న విషయం పలువురిని విస్మయం కలిగించింది.
నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. అనుమానాప్పద స్థితిలో అవుల వంశీ అనే మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది.
ఇదేనా ప్రజా పాలన అంటే.. తాగే నీళ్ళు కూడ సక్కగా ఇవ్వలేరా? అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

