
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, 24ఏళ్ల చరిత్రలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదు అని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామని, కాంగ్రెస్, బిజెపి ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తామాన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతాం అని చెప్పారు.






