
స్వర్ణోదయం ప్రతినిధి, విశాఖపట్నం,జూన్ 05:
కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ..
రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశాను. ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం అని చెప్పారు.
ఇవాళ కూటమి మీటింగ్కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులుంటే మీకు తప్పకుండా చెప్తాను..అని అన్నారు. ఇండియా కూటమి బాబును కలిసి మద్దతు కొడతామని ప్రకటించిన కొద్దిసేపటికే చంద్రబాబు నాయుడు తన మదిలోని మాటను ఈ విధంగా వెలుగుచడంతో కూటమి ఆశలు అడియాసలయ్యాయి.






