
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్యాన్సర్ వ్యాధితో రాత్రి మృతి చెందిన పట్టణానికి చెందిన రఘు అంత్యక్రియ నిర్వహించేందుకు ఆర్థిక సాయం చేయాలని అతని కుటుంబ సభ్యుల అభ్యర్థించగా హుజురాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి రూ.2000 రూపాయలు ఫోన్ పే చేసి తమ ఉదారత చాటుకున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయంత్రం లోగా అంత్యక్రియలకు సహకరించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
