
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:

ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం. కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన రవి (54) కరీంనగర్ ఎక్సైజ్ అర్బన్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఇంటి కోసం లోన్ తీసుకున్నారు. లోన్ కట్టడంలో ఇబ్బంది, పిల్లల చదువుకు డబ్బు సరిపోవడం లేదని 4 నెలల కింద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉంటున్న రవి బుధవారం డ్యూటీకి వెళ్లి వచ్చి ఇంట్లో ఊరివేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుకున్నట్లు సిఐ విజయ్ కుమార్ తెలిపారు.