
-హుజురాబాద్ లేబర్ ఆఫీసర్ చందన
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్.
ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను లేబర్ కార్డు కలిగిన ప్రతి కార్మికుడు పొందాలని హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ అధికారిణి చందన అన్నారు. గురువారం హుజురాబాద్ లో ఆమె మాట్లాడుతూ…. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని అర్హుడైన ప్రతి కార్మికులు లేబర్ కార్డు తీసుకోవాలని కోరారు. కొత్త కార్డు తీసుకునే కార్మికుడు దళారుల వద్దకు వెళ్లకుండా కార్యాలయానికి వచ్చి స్వయంగా దరఖాస్తు తీసుకుని ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్డు కలిగిన కార్మికులకు యాక్సిడెంట్ డెత్ క్లైములు, సహజ మరణము క్లైములు, పెళ్లి కానుక, మేటర్నిటీ సహాయము కొరకు స్వయంగా కార్యాలయంకు వచ్చి దరఖాస్తు అందజేసి రిజిస్టర్లో సంతకం చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తుకు కార్యాలయం వారు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. లేబర్ కార్డు కలిగిన ప్రతి కార్మికుడు ఐదు సంవత్సరంలకొకసారి దానిని రెన్యువల్ చేసుకోవాలని లేని పక్షంలో క్లైములు తీసుకోవడానికి అనర్హులవుతారని ఆమె తెలిపారు.
