
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వైద్యులను దేవుళ్ళతో సమానంగా కొలుస్తారని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి వైద్య వృత్తిపై నమ్మకాన్ని పెంచాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కూరగాయల మార్కెట్ రోడ్డులో నూతన ఏర్పాటు చేసిన ‘ప్రకృతి హాస్పిటల్ ‘ను ఆదివారం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… హాస్పిటల్ కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి వైద్యుల గొప్పతనాన్ని చాటుకోవాలన్నారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఆధునాథన వైద్య చికిత్సలను అందించాలన్నారు. కార్పొరేటు ఆసుపత్రికి దీటుగా హుజురాబాద్ ల అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన ఆసుపత్రి నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ నందితరెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప్ తిరుమల్ రెడ్డి, కల్లేపల్లి రమాదేవి, మారేపల్లి సుశీల, ముత్యం రాజు, తొగరు సదానందం, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆర్ఎంపి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.


