
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకొని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన నిండా నూరేళ్లు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు, గూడూరు స్వామిరెడ్డి,
వేముల పుష్పలత, లావణ్య, వడ్లూరి విజయకుమార్, నేరెళ్ల మహేందర్ గౌడ్, సుశీల, లక్ష్మి, రాధ, మహేశ్వరి, కొలిపాక శంకర్, ఎర్ర రవీందర్, ఎర్ర రమేష్, ఎర్ర శ్రీనివాస్, బండారి సదానందం, ఎండి.థౌశిక్, సలీం, ఎండి చాంద్, మోరే తిరుపతి, గడ్డం రాఘవేంద్ర, బిక్షపతి, విద్యాసాగర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎర్ర కుమార్, కిరణ్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, సంపత్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

