
స్వర్ణోదయం ప్రతినిధి, జనగామ:
ఓ మహిళపై మంత్రాల నెపంతో గొడ్డలితో దాడి చేసిన ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్మెట్ట గ్రామానికి చెందిన నక్కల రవి, తండ్రి పోచయ్య వారి కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా అనారోగ్యము పాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానికురాలైన సత్తమ్మ మంత్రాలు చేస్తుందని అనుమానం పెంచుకొని ఆమెను ఎలాగైనా మట్టు పెట్టాలని, సత్తెమ్మపై రవి గొడ్డలితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని సమగ్ర విచారణ జరుపుకున్నారు.
