
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది కనుక ఇక బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు భావిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం దావతులు కొనసాగిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
