
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక టీ డబ్ల్యూ జెఎఫ్ కార్యాలయం హుజురాబాద్లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ వారు రవీంద్ర భారతిలో పోచంపల్లి సమ్మయ్యని సామాజిక సేవలో భాగంగా వధూవరుల పరిచయ వేదికను సేవా భావంతో నడుపుతున్న పోతిరెడ్డిపేట గ్రామ నివాసి పోచంపల్లి సమ్మయ్యని మహానంది అవార్డుతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనని శుక్రవారం స్థానిక టిడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో ఘనంగా స్థానిక పెన్షనర్స్ అండ్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ పోచంపల్లి సమ్మయ్య మహానంది అవార్డు పొందడం పోతిరెడ్డిపేట గ్రామానికి గర్వకారణమన్నారు. ఆయన ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను ఇంకా మరెన్నో చేపట్టి పోతిరెడ్డిపేట గ్రామా ముద్దుబిడ్డగా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగాలని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎండి ఖాళీ హుస్సేన్, జ్యోతిరావు పూలే కమిటీ మాజీ అధ్యక్షులు సందేల వెంకన్న, పెన్షనర్స్ సంఘం నాయకులు బొంగోని వెంకటయ్య, ఐలి సతీష్, పోచంపల్లి సమ్మయ్య, పోచంపల్లి శ్రీనివాస్, అనిల్, హరీష్, రాజు, రాకేష్ కుమార్, మంచికట్ల విజయకుమార్, శనిగరపు ఐలయ్య, వేల్పుల భాస్కర్, ఆది కేశవులు, పొడిశెట్టి రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
