
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మున్సిపల్ ఆవరణంలో ఎదురుగా ఉన్న షట్టర్ల యజమానులను క్రమబద్ధీకరణ చేసుకోమని అంటే తమపై బురద చల్లే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, పాలకవర్గం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన విజయకుమార్ అనే వ్యక్తికి ఈ కాంప్లెక్స్ లో షట్టర్ లేనేలేదని, కానీ కొందరు పాలకవర్గం తనను డబ్బుల కోసం వేధించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ షటర్లను అసలు యజమానులను క్రమబద్ధీకరణ చేసుకోమని మాత్రమే పాలకవర్గం తీర్మానం చేసిందని, వారికి రెగ్యులరేషన్ చేసుకోవాలని మాత్రమే చెప్పడం జరిగిందని తెలిపారు. ఆ షెటర్ యజమానులు గత ఆరేళ్లుగా ఎలాంటి టాక్స్ మున్సిపల్ కు చెల్లించడం లేదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని టాక్స్ చెల్లింపునకే నోటీసులు పంపడం జరిగిందని, దీనిని కొందరు వక్రీకరించి వేరే విధంగా ప్రచారం చేస్తున్నారని వారన్నారు.
