
స్వర్ణోదయం ప్రతినిధి, భూపాలపల్లి:
కుకాళేశ్వరం ఎస్సై భవానీసేన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఎస్సై భవానీసేన్ ను పరకాల జైలుకు తరలించారు. ఇప్పటికే భవానీసేన్ను సర్వీసు నుంచి తొలగించిన అధికారులు విదితమే. లైంగిక వేధింపుల ఆరోపణలపై భవానీసేన్ అరెస్ట్ అయ్యారు. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం చేసినట్లు భవానీసేన్పై ఆరోపణలు గుప్పుమనడంతో అరెస్టయ్యారు. అలాగే గతంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండైనట్లు తెలుస్తుంది.
-కాళేశ్వరం ఎస్ ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు
మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న పీవీఎస్ భవాని సేన్ పాత కాళేశ్వరం పోలీస్ స్టేషన్ బిల్డింగ్లో 2 అంతస్తులో నివాసం ఉంటున్నాడు, అదే పాత కాళేశ్వరం పిఎస్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మహిళ హెడ్ కానిస్టేబుల్ నివాసం ఉంటున్నారు. పాత కాళేశ్వరం పోలీస్ స్టేషన్ బిల్డింగ్ అనేది లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఉంది. 15 -6- 2024 రోజున దాదాపు రాత్రి 10 గంటలకు బాధిత మహిళా హెడ్ కానిస్టేబుల్ తన విధి నిర్వహణ ముగించుకొని తన నివాసమైన పాత కాలేశ్వరం పోలీస్ స్టేషన్లోని తన ఇంట్లోకి చేరుకొని నిద్రకు ఉపక్రమించింది. అదే రోజు సుమారు రాత్రి ఒంటిగంట సమయంలో అనగా 16- 6- 2024 అదే భవనంలో 2 వ అంతస్తులో నివాసం ఉంటున్న కాళేశ్వరం ఎస్సై పివిఎస్ భవాని సేన్ అక్రమంగా కిటికీలోంచి మహిళా హెడ్ కానిస్టేబుల్ గదిలోకి చొరబడి, బాధిత మహిళ హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి మేల్కొన్న బాధితురాలు ఎస్సైని ప్రతిఘటించింది, అయినప్పటికీ వినకుండా తన సర్వీస్ రివాల్వర్ తో బాధితురాన్ని బెదిరించి ఆమెను గాయపరిచి, అత్యాచారానికి SI పాల్పడి, అదే రోజు రాత్రి 2:15 నిమిషాలకు బాధితురాలి గది నుంచి బయటికి వెళుతూ అత్యాచార విషయం బయటకు చెబితే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధిత మహిళా హెడ్ కానిస్టేబుల్ ను ఎస్సై భవానిసేన్ బెదిరించాడు. అలాగే సుమారు 20 రోజుల క్రితం మహిళా హెడ్ కానిస్టేబుతో ఎలాగైనా శారీరకంగా కలవాలని వక్రబుద్ధితో రాత్రి 10 గంటలకు పాత కాళేశ్వరం పిఎస్ బిల్డింగ్ లో బాధిత మహిళా కానిస్టేబుల్ కు ఎస్సై భవాని సేన్ ఫోన్ చేసి తన కాలు స్లీప్ అయ్యి జారిపడ్డానని, కాలికి గాయం అయిందని, తన గదికి రావాలని అభ్యర్థించగా వెంటనే బాధితురాలు ఎస్ఐ గదిలోకి వెళ్ళింది దీంతో ఇదే అదునుగా భావించిన నిందితుడయిన ఎస్సై ఆమెను లైంగికంగా ప్రలోభ పెట్టడంతో, ఎస్సై ఉద్దేశాన్ని గుర్తించిన బాధితురాలు అతని తోసివేసి తన గదిలోకి పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్లు వేసుకుంది. అనంతరం ఈ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కాళేశ్వరం గ్రామంలో అద్దే గది కోసం వెతుకుతున్న క్రమంలో ఈ నెల 15న రాత్రి ఒంటిగంటకు అనగా 16వ తేదీన బాధితురాలుపై ఎస్సై భవాని సేన్ అత్యాచారం చేశాడు.
ఈ ఘటనపై బాధిత మహిళ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలిసు స్టేషన్ లో U/S 449, 376 (2))(a) (b) 324, ,506, ఐ.పి.సి కింద ఎస్ఐకి వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా భూపాలపల్లి SDPO సంపత్ రావును జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే నియమించారు. అత్యాచార ఘటనపై భూపాలపల్లి SDPO విచారణ జరిపగా, ఆరోపణలు నిజమని తేలడంతో బాదిత మహిళను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎస్సై భవాని సేన్ దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ మరియు పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న డిఎస్పి బృందం, నేడు బుధవారం ఉదయం కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను అరెస్టు చేసి, భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ అడిషనల్ JFCM కోర్టు ఎదుట హాజరు పరిచారు.
అలాగే నిందితుడు భవాని సేన్ ఇంతకుముందు 22- 6- 2002 న ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతికి మెటీరియల్ ఇప్పిస్తానని ఆఫీసుకు పిలిపించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడగా, యువతి ఫిర్యాదు మేరకు అదే రెబ్బన పిఎస్ లో 354 -D IPC సెక్షన్ ప్రకారం కేసు నమోదు అవ్వగా ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఎస్సై భవాని సేన్ ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు ఆసిఫాబాద్ కోర్టులో ట్రయల్ లో ఉంది.
కాళేశ్వరం మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచార ఘటనపై చట్టపరమైన చర్యలకై మల్టీజోన్ – 1 ఐజి ఏవి రంగనాథ్ ఐపీఎస్ కి ఎస్పీ కిరణ్ ఖరే సమగ్ర నివేదిక పంపగా, సదరు ఎస్ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్.ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా వుండడంతో ఎస్ఐ పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ నపై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా మల్టీ 1జోన్ ఐజీ ఏ వి రంగనాథ్ వెల్లడించారు.

