
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. ఆయన ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆశీస్సులతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు, బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, ఇతర రాజ్యసభ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.






