
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ జూలై 6: నాగార్జున డైరీ, గణపతి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావుకి, న్యూఢిల్లీలోని వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ వారు బిజినెస్ మేనేజ్ మెంట్ పై శనివారం రోజున గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఈ అవార్డుని అందజేసిన వారిలో బాలీవుడ్ అడ్రెస్ నికాశర్మ, సుప్రీంకోర్టు అడ్వకేట్స్, సెంట్రల్ టూరిజం అంబాసిడర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున డైరీ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు, డైరీ, సీడ్స్ ఉద్యోగులైన పాతూరి రజినీకాంత్ రెడ్డి, ఎడ్ల సుధాకర్, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.


