
స్వర్ణోదయం ప్రతినిధి, తిరుమల తిరుపతి : తితిదే పరిపాలనా భవనంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. తితిదేకు చెందిన పలు విభాగాల్లో 40 మందితో సోదాలు. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఐదేళ్లుగా తితిదేలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. తిరుపతిలో స్థానికుల నుంచి విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించారు. అక్రమాల వివరాలను విజిలెన్స్ అధికారులకు బీజేపీ నేత నవీన్ అందించారు. తన వద్ద ఉన్న ఆధారాలను విజిలెన్స్ అధికారులకు నవీన్ కుమార్ రెడ్డి అందించారు.
