
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును అందించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్, శ్రీమతి ఉమా మహేశ్వరి లకు సచివాలయంలో సీఎం చేతుల మీదుగా చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఉన్నత పురస్కారాలు అందుకున్న తెలుగువారిని సంస్కరించుకోవడం మన బాధ్యత అనీ సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
