
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ (మాస్కో): భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్టల్ “ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2019లోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోదీనే కావడం విశేషం. రష్యా అత్యున్నత పూర పురస్కారం అందుకోవడం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

