
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: పార్టీమారిన ఎమ్మెల్యే ల అనర్హత పిటీషన్ లపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువడించింది. నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీ కి హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశం జారీ చేసింది. లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనారహత వేటు పై బిఆర్ఎస్ పార్టీ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది.






