Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణా భాషా దినోత్సవం మరియు ప్రజాకవి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా కళాశాల ప్రిన్సిపాల్ వి అంజనేయరావు కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించారన్నారు. అంతేకాకుండా తెలంగాణా భాషా మాండలికాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి అని, కాళోజీ రచించిన ‘నా గొడవ’ రచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు అధ్యాపకులు తులసి దాసు, శైలజ, పున్నం చందర్, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.






