
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల విద్య వనరుల కేంద్రంలో మండల విద్యాధికారిగా ఆదనపు బాధ్యతలను MNO మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా సింగపూర్ జెడ్ పి హెచ్ స్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భూపతి శ్రీనివాస్ ని ప్రభుత్వము నియమించగా ఆయన గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో గల ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆయనను కలసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.ప.ఉ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడపు శ్రీనివాస్, జి.ప.ఉ. పాఠశాల రాంపూర్ ప్రధానోపాధ్యాయులు ప్రదీప్, జి.ప.ఉ. పాఠశాల కందుగుల ప్రధానోపాధ్యాయులు S. మహేందర్ రెడ్డి, జి.ప.ఉ. పాఠశాల boys హుజురాబాద్ ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, జి.ప.ఉ. పాఠశాల గర్ల్స్ ప్రధానోపాధ్యాయులు తిరుమల, పిడి సొల్లు సారయ్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజురాబాద్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, MRC సిబ్బంది సన్మానించిన వారిలో ఉన్నారు.
