
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
155వ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ భారత్ కార్యక్రమాలను పురస్కరించుకొని హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ మరియు సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను తపాల కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాంధీజీ పటానికి పూల మాలతో నివాళులు అర్పించి గాంధీజీ కలలు కన్న పరిశుభ్ర భారతావనిని నిర్మించడంలో పారిశుధ్య కార్మికులు ముందు ఉన్నారని, అదే లక్ష్యంతో దేశ పౌరులందరు భాగస్వాములు కావాలని పోస్ట్ మాస్టర్ యు మహేందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సన్మానం పొందిన పారిశుధ్య కార్మికురాలు రాచపెల్లి కాంతమ్మ, రాచపాల్లి లూల, మాటూరి పద్మ మరియు పోస్టల్ సిబ్బంది S.రాజు, K సందీప్, B తిరుపతి నాయక్, S హరీష్, స్వామి, సతీష్, రాజేష్, శివాజీ, రాము అపూర్వ, శివం, గోరవ్, అనిల్, నూక సదానందం పాల్గొన్నారు.









