
–తెలంగాణ ఆడ బిడ్డలకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడ బిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి నుంచి 9 రోజుల పాటు జరుపుకునే పూల పండుగ, బతుకునిచ్చే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ అత్యంత వైభవంగా ఆనందోత్సహాల మధ్య జరుకోవాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయన్నారు. బతుకమ్మ సంబురాలు సందర్భంగా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. మహిళలు తీరోక్క పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసుకొని ఆటపాటలతో సంప్రదాయబద్దంగా సంబురాలు జరుపుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ పల్లె పల్లెనా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకోవాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.






