
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చేసాయి, నిజామాబాద్ రీజినల్ కు మొత్తం 64 బస్సులు రానుండగా మొదటి విడతగా 13 ఎలక్ట్రానిక్ బస్సులు నిజామాబాద్ డిపోకు చేరుకున్నాయి. నిజామాబాద్ బస్ స్టేషన్ లో ఈరోజు శుక్రవారం 13 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధనుపాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డిలతో కలిసి ఆయన బస్సులో ప్రయాణించారు.






