

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్ 8: చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రదర్శనను కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయరంగం తర్వాత చేనేత రంగం అపారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. చేనేత నేత నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని అన్నారు.