
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మ్యాక రాములు పిఆర్ టియు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి పిఆర్ టియు కార్యవర్గ ఎన్నికల సందర్భంగా రాములుకు ఈ పదవి లభించింది. 1998 నుండి ఉపాధ్యాయుడుగా పిఆర్టియు నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేసిన రాములుకు ఈ పదవి రావడం పట్ల హుజురాబాద్ మండల పిఆర్టియు నాయకులు మాధవరావు, భాగ్యరేఖలు హర్షం వ్యక్తం చేశారు.
