Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ప్రభుత్వం నూతనంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేను నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో రెండు విడుదల్లో సర్వే ఎన్యుమారెటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సర్వే చేసే ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ యజమాని వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. ఎలాంటి సందేహాలున్న ఆర్పిలను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎంపీఓ సతీష్ రావు, కిషన్ రావు, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.







