
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వికారాబాద్ కలెక్టర్ జైన్, అదనపు కలెక్టర్ల పై సోమవారం జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని, ప్రభుత్వం చెప్పిన పనులు మాత్రమే ఉద్యోగులు చేస్తారని, స్వతంత్రంగా చేయరని వారు అన్నారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకూడదని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో హుజురాబాద్ తాసిల్దార్ కె కనుకయ్య, ఆర్. ఐలు రంజిత్ రెడ్డి, శేఖర్, ఇతర రెవెన్యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
