
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు, అధ్యాపకులు కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ ఆంజనేయరావు మాట్లాడుతూ ప్రతీ రోజు విద్యార్థులు కళాశాలకు యూనిఫాం , ఐడెంటిటీ కార్డు ధరించి రావడం వల్ల పిల్లలో ఐక్యతా భావం కలుగడంతో పాటు, ఫలానా కళాశాల అనే గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.








