
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోనే రంగనాయకుల గుట్ట సమీపంలో గల పాటీమీద ఆంజనేయస్వామి సరస్వతి మాత సహిత ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సరస్వతి మాత ఆలయం ముందు నూతనంగా రేకుల షెడ్డు SPR పాఠశాల అధినేత జగన్ వేయించగా మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. జగన్ తో కలిసి ఆ షెడ్డును మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు తిరుమలయ్య, ప్రదీప్, భూమ్ రామకృష్ణ, రాంబాబు, వాసు, దోమకుంట్ల రాజు మరియు భక్తులు పాల్గొన్నారు. కాగా
ఈ సందర్భంగా జగన్ ను ఆలయ కమిటీ శారువాలతో ఘనంగా సన్మానించారు.







