
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలనీ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్ఆర్ఆర్ మైదానం సభ స్థలిలో భూమి పూజ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఊపాధ్యాయులు, ఎల్ఐసి ఉద్యోగులు, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖులు, భారీ ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట v రవీందర్ రెడ్డి, ఎర్రం శెట్టి మునిందర్, మహిపాల్ రెడ్డి, యూత్ లీడర్ కోమటిరెడ్డి అశోక్ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.






