
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి మద్దతుగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్
కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం భారీ బహిరంగ సభకు హుజురాబాద్ నుండి విఎన్ఆర్ యువ నాయకుడు కర్రే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలపై కరీంనగర్ కు తరలి వెళ్లారు. తరలి వెళ్ళన వారిలో విఎన్ఆర్ యువనాయకులు కర్రే శ్రీధర్ రెడ్డి, అల్లాడి ఉమాశంకర్, కేతిరి కొండాల్ రెడ్డి, మాడ శ్రీకాంత్ రెడ్డి, సంపత్ గౌడ్, సంపత్, రాజు, మహేందర్ తదితరులు ఉన్నారు.








