
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పంజాలా అరవింద్ గౌడ్ అధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు
కేక్ కట్ చేశారు అనంతరం స్ధానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లి పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ప్రెసిడెంట్ చాల్లురి రాహుల్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనిగారం తరుణ్ కుమార్, హాస్పిటల్ RMO సుధాకర్ రావు, సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, మండల వైస్ ప్రెరెడ్డిట్ రాజ్ కుమార్ సందీప్, విష్ణు, అరుణ్, కార్యదర్శి పంజల రాజు నాయకులు టేకుల శ్రవణ్, సంపత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.








