
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుజురాబాద్ పట్టణంలో సశక్తికరణ్ అభియాన్ లో భాగంగా పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఎన్నికల పర్వ్ ఇంచార్జి, రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ దండు కొమరయ్య పర్యవేక్షణలో 27, 61, 62, 63వ బూత్ ల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. బూత్ కమిటీల అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో రాపాక రాజు, యాళ్ల లీల, బొడ్డు మహేష్, పల్లె వీరయ్యను శక్తి కేంద్ర సహయోగిలు యాంసాని శశిధర్, సబ్బని రమేష్, యాళ్ల సంజీవరెడ్డి, పాడారి కొమురయ్య, దండ సమ్మిరెడ్డిల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కాగా నూతనంగా ఎన్నికైన వారిని శాలువాతో చిరుసత్కారం చేసినట్లు వారు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన వారికి పలువురు అభినందనలు తెలిపారు.



