
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన కోయల్ కార్ శ్యామ్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ గురువారం హైదరాబాద్ జాతీయ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశ కార్యక్రమంలో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని, ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. 80 నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సంస్థ నిర్వాహకులకు శ్యాం కృతజ్ఞతలు తెలిపారు.
