
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని ‘శీతాకాలపు అయనాంతం’ అని అంటారు. ఈ వింత ఎంతమంది ఆస్వాదిస్తారో వేచి చూడాల్సిందే!.
