Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి రమేష్,(45) అనే వ్యక్తి శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం ప్రకారం… రమేష్ అనారోగ్యంతో బాధపడేవాడని, కుటుంబ కలహాల మూలంగా మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







