
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పది మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఉట్నూరు అదనపు ఎస్పీగా కాజల్, దేవరకొండ అదనపు ఎస్పీగా మౌనిక, భువనగిరి అడిషనల్ ఎస్పీగా రాహుల్రెడ్డి, ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా చిత్తరంజన్, కామారెడ్డి అడిషనల్ ఎస్పీగా బొక్కా చైతన్య, జనగామ అడిషనల్ ఎస్పీగా చేతన్ నితిన్, భద్రాచలం అడిషనల్ ఎస్పీగా విక్రాంత్కుమార్, కరీంనగర్ రూరల్ అడిషనల్ ఎస్పీగా శుభమ్ ప్రకాష్, నిర్మల్ అడిషనల్ ఎస్పీగా రాజేష్ మీనా, డీజీపీ కార్యాలయానికి అంకిత్కుమార్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.







