Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరోత్తంరెడ్డిని, కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్యను, కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఆయన ప్రకటించారు.






