
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల శోభన్ కుమార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాదాపూర్ జన్మదిన వేడుకలను హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఘనంగా పుల్ల వంశస్థులు నిర్వహించారు. చెల్పూర్ గ్రామంలో పుల్ల వంశస్థులతో పాటు వివిధ యూత్ పిల్లలు మరియు గ్రామ ప్రజలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. చేల్పురు గ్రామంలో బస్టాండ్ ఆవరణలో సుమారుగా 50 మంది పుల్ల వంశాస్థులతో పాటు చెల్పూర్ గ్రామంలోని యూత్ పిల్లలు పాల్గొని కేక్ కట్ చేసి, కేకులు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జమ్మికుంట మండలంలోని సత్యసాయి అనాధ ఆశ్రమంలో 40 మంది పిల్లలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్ల శ్రావణ్ కుమార్, పుల్ల రాధ, పుల్ల వెంకన్న, పుల్ల యేసు, పుల్ల ఆనందం, పుల్ల అనిల్ కుమార్, పుల్ల దాస్, పుల్ల రమేష్, పుల్ల బిక్షపతి, పుల్ల ముజ్జు, పులాల నరేందర్, రాజేందర్, జైపాల్, అరవింద్, బన్నీ మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


