
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఎల్కతుర్తి) జనవరి 27: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామ బ్రిడ్జిమీద(నేషనల్ హైవే 563) హనుమకొండ వైపు నుండి లోడుతో వస్తున్నటువంటి TS 24TA3645 లారీ హుజురాబాద్ వైపు నుండి వస్తున్నటువంటి ద్విచక్ర వాహనం నెంబర్ AP 28DM5764(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్) ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలంలోని సురారం గ్రామానికి చెందిన బచ్చు రాజేశ్వరరావు(54 సంవత్సరాలు) వీరనారాయణపూర్ లో నూతనంగా నిర్మించుకున్న ఇంటికి వెళ్లి హుజురాబాద్ వైపు వస్తుండగా లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం పైన కింద పడి తల పగిలి తీవ్రత గారితో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు..







