
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన DTF మండల శాఖ సమావేశంలో హుజురాబాద్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడిగా బండ శ్రీనివాస్ (ZPHS జూపాక), ఉపాధ్యక్షులుగా టీ విజయ (ZPHS Girls హుజురాబాద్), ఏం రాజేష్ కుమార్ (DPEP చెల్పూర్), ప్రధాన కార్యదర్శిగా బేతి తిరుపతిరెడ్డి (ZPHS పెద్దపాపయ్యపల్లి), కార్యదర్శులుగా ఎస్.విక్రమ్, ఏ.కరుణశ్రీ, బి.వీరన్న నాయక్, జిల్లా కౌన్సిలర్లుగా పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, శ్రీరామ్ చక్రధర్, అల్లి శ్రీనివాస్, వెంకట్రాజం, ఉయ్యాల శంకర్, చంద్రగిరి మల్లేశం, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ముషం సత్యరాజం, సభ్యులుగా జీ.ఆంజనేయులు ఆర్.భాస్కర్ లను ఎన్నికైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి, జిల్లా కౌన్సిలర్ ఏబూషి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షుడు శ్రీనివాస్
