
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఈ ఈనెల 01నుండి 31వరకు జరుగు కార్యక్రమంలో భాగంగా ప్రమోదరహిత డ్రైవర్ లకు ఘన సన్మాన నిర్వహించారు. సర్వీస్ మొత్తంలో ఎలాంటి ప్రమాదాలు చేయకుండా ఉన్నవారికి కరీంనగర్ రీజినల్ మేనేజర్ చేతుల మీదుగా అవార్డ్స్ పంపిణీ చేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. సత్కారం పొందిన వారిలో హుజురాబాద్ డిపోకు చెందిన సిహెచ్ ఆగయ్య ( 318857), జి శ్రీనివాస్ (319471), ఈ ఆర్ రావు (310914), పి ఎస్ రావు (320008)లకు అవార్డు పంపిణీ చేయడం జరిగింది. కాగా వీరిని డిపో మేనేజర్ రవీంద్రనాథ్, ఆర్టిసి అధికారులు సిబ్బంది అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
