
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ లో హుజురాబాద్ కు చెందిన జూపాక సాయి సంతోష్ కట్ట మరియు కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ రావడం పట్ల హుజురాబాద్ టౌన్ సీఐ జి తిరుమల గౌడ్ శాలువా కప్పి జ్ఞాపకం చేసి అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన జూపాక సాయిసంతోష్ ని కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్లాక్ బెల్ట్ భూసారపు బాపూరావు, జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ మరియు కరాటే స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన టౌన్ సిఐ తో పాటు మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, సీనియర్ కరాటే మాస్టర్ బత్తుల సమ్మయ్య గోల్డ్ మెడల్ సాధించిన జూపాక సాయి సంతోష్ నీ సత్కారించి హర్షం వ్యక్తం చేశారు. అలాగే సాయి సంతోష్ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించేలా కృషిచేసిన కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్లాక్ బెల్ట్ భూసారపు బాపూరావుని మరియు జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ ని కరాటే స్టూడెంట్స్ ఘనంగా సన్మానించారు.


