Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి14: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ కి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఫిజికల్ డైరెక్టర్ శ్యాంసుందర్ ఎంపికయ్యారు. జడ్ పి హెచ్ ఎస్ (బాయ్స్) ముల్కనూరులో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సాధుల శ్యాంసుందర్ ఈనెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు కాకినాడలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కు ఎంపికైనట్టుగా, తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది..సాధుల శ్యాంసుందర్ ఎన్నిక పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాసు, సెక్రటరీ ఉమామహేశ్వర్, హాకీ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, తోట రాజేంద్రప్రసాద్, గుడ్డెలుగుల సమ్మయ్య, చింత శ్రీనివాస్, భూసారపు శంకర్ శ్రీనివాసు, రవికుమార్, యూసుఫ్, సజ్జు బండ రఘు, ఆరెల్లి రమేష్, తిరుపతి, కుమారు, సాయికృష్ణ, ప్రదీప్, రాజేషు, విక్రం, సాంబ, వినయ్, వేణు, స్నేహితులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.






