
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట, ఫిబ్రవరి 14: నినాదం హుజురాబాద్ ఆర్సి ఇంచార్జ్ అయిత రాధాకృష్ణ మాతృమూర్తి అయిత రాజ్యలక్ష్మి ఇటీవల స్వర్గస్తులైనారు.
ఈ సందర్భంగా”తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సురంజన్, డాక్టర్ సురేష్ తదితరులు అయిత రాధాకృష్ణ స్వగ్రామం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయిత రాజ్యలక్ష్మి మరణం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ ఘనమైన నివాళి అర్పించారు.







