
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షల రోజువారి ఖర్చులకోసం జయన్న ఫౌండేషన్ బుధవారం ఆర్థిక సహాయం అందజేసింది. హుజూరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమయ్య మాట్లాడుతూ…మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆర్థిక మండలంలోని 244 మంది విద్యార్థులకు గాను 1.70,800 రూపాయలను అందించడం ప్రశంసనీయమని అన్నారు. హుజురాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాల బాలికలకు పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి, స్నాక్స్ రోజు వారి ఖర్చు కోసం రోజుకు వంద రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి 700 రూపాయలు అందించడం గొప్ప విషయమని అన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా భావించి, ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోటే ఈ ఆర్థిక సాయం చేయడం జరిగిందని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిపాటి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. విద్య ఒక్కటే దొంగిలించేది కాదని దానిని ఎవరైతే సొంతం చేసుకుంటారు వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న లక్ష్యంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించి విద్యార్థులకు తనకు తోచిన ఈ చిన్నపాటి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది అన్నారు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేకచోట్ల ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత విద్యకు సంబంధిత కార్యక్రమాలు అందించడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసులు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అలాగే జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు జైపాల్ రెడ్డి సరిత దంపతులను ఉపాధ్యాయులు పుష్ప గుచ్చాలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎస్ఎస్సి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించే విద్యార్థులకు ఫౌండేషన్ తరపున నగదు పురస్కారాలు అందజేస్తామని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులను పూల వర్షం కురిపించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ బండ శ్రీనివాస్, ప్రొఫెసర్ జి ప్రదీప్ కుమార్, హెచ్ఎం బోరగాల తిరుమల, వేల్పుల రత్నం, ఈశ్వర్ రెడ్డి, మహమ్మద్ కాలిద్ హుస్సేన్, ప్రభాకర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎస్సి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్న జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకులు జైపాల్ రెడ్డి -సరిత దంపతులు..

బాలికల ఉన్నత పాఠశాలలో చదివే ఎస్ఎస్సి విద్యార్థులు నగదు పురస్కారాలతో..

సిర్శపల్లికి చెందిన ఎస్ఎస్సి విద్యార్థులు నగదు పురస్కారాలతో..

ఎంఈఓ శ్రీనివాస్ ను సత్కరిస్తున్న జైపాల్ రెడ్డి దంపతులు


జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు జైపాల్ రెడ్డి సరిత దంపతులను సన్మానిస్తున్న ఎంఈఓ, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు.

మహమ్మద్ కాలేదు హుస్సేన్ ను సన్మానిస్తున్న జైపాల్ రెడ్డి దంపతులు..